బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మరోసారి తాఖీదులు ఇచ్చింది. మనీ లాండరింగ్ చట్టాన్ని (ఫారిన్ ఎక్స్ చేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్ – ఫెమా) ఉల్లంఘించిన కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి వచ్చే వారం ఈడీ ముందు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో రెండోసారి ఆమెకు ఈడీ నోటీసులిచ్చినట్టయింది. ఇటీవలే బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ ను యామీ ప్రేమించి పెళ్ళి చేసుకుంది. తెలుగులో నువ్విలా, యుద్ధం, గౌరవం, కొరియర్ బాయ్ కళ్యాణ్ చిత్రాల్లో మెరిసిందీ బ్యూటీ.
ఇవీ చదవండి..
చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..
ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?
హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?
పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.