బోలెడంత ఆస్తి ఉంది.. ఒక్కడే కొడుకు , అయితే హిజ్రాల్లో కలిసిపోయాడు.. పెద్దపల్లి జిల్లాకి చెందిన మహేశ్ కి చిన్ననాటినుంచి వచ్చిన మార్పులు తల్లితండ్రులు పసిగట్టలేకపోవడంతో , హిజ్రాగా మారాలని భావించాడు. అందుకే పరారయ్యాడు. దీంతో తల్లితండ్రులు కొడుకు కోసం వెదుకులాట మొదలుపెట్టారు. చివరకు . వేములవాడలో ఉన్నాడని తెలుసుకొని అక్కడికెళ్లారు.
రూపం మార్చుకొని , చీరకట్టుకొని , పూలుపెట్టుకొని కనపడ్డ కొడుకు హిజ్రాలతో ఉండటాన్ని చూశారు. అతడిని ఇంటికి తీసుకుపోవాలని చూస్తే రానని మొండికేశాడు . దీంతో ఇతర హిజ్రాలు కూడా మహేష్ ని పోనీయకుండా అడ్డుకున్నారు. ఎట్టకేలకు మహేష్ ని , తల్లితండ్రులు బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకుపోయారు..