పెట్రోల్ రేట్లు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.. లీటర్ పెట్రోల్ రేటు దాదాపుగా 110 రూపాయలకు చేరింది. దీంతో పెట్రోల్ బంకుకు వెళ్లాలంటేనే జనం హడలిపోతున్నారు. అసలే పెరిగిన రేట్లతో జనం అల్లాడిపోతుంటే.. మరోవైపు బంకుల్లో జరిగే మోసాలతో జనం మరింతగా విసిగిపోతున్నారు. తాజాగా పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్లిన ఓ వ్యక్తికి విచిత్ర అనుభవం ఎదురైంది. వాహనానికి పెట్రోల్ కొట్టించగా ఎందుకో అతడికి అనుమానం వచ్చింది. తీరా చూస్తే పెట్రోల్ బదులుగా నీళ్లు రావడంతో ఆ వ్యక్తి ఖంగు తిన్నాడు. అంతటితో ఊరుకోకుండా ఓ బకెట్ తీసుకొచ్చి పెట్రోల్ కొట్టమని చెప్పాడు. తీరా చూస్తే బకెట్ నిండా నీళ్ళే రావడంతో మరింతగా ఆశ్చర్యపోయాడు. దీంతో ఈ తతంగం మొత్తాన్ని వీడియో తీయించి సోషల్ మీడియాలో పెట్టేశాడు. కరీం నగర్ జిల్లాలోని బొమ్మకల్ లో ఈ సంఘటన జరిగింది.
Motorists were flabbergasted after they found a Petrol Bank at Bommakal dispensing water instead of petrol. A commotion between the employees and consumers took place with police intervening in the matter. Petrol in Karimnagar is sold over 105/Liter. #Telangana #FuelPriceHike pic.twitter.com/IhCsqW7eoj
— Aashish (@Ashi_IndiaToday) August 2, 2021