లవ్ జిహాద్ పేరుతో జరిగే మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక చట్టాన్ని తెస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. అబద్దాలు చెప్పి మోసం చేసి పెళ్ళి చేసుకుంటే లవ్ జిహాద్ కింద పరిగణిస్తామన్నారు. ముస్లిం అయినా, హిందువు అయినా క్రిస్టియన్ అయినా .. ఎవరైనా సరే ఒక మహిళను మోసం చేసి పెళ్ళి చేసుకుంటే, దాన్ని లవ్ జిహాద్ గానే చూస్తామని చెప్పారు. ఏ అమ్మాయి మోసపోకూడదని, మహిళల రక్షణ కోసమే లవ్ జిహాద్ చట్టం తెస్తున్నట్లు చెప్పారు. ఈ చట్టం ప్రకారం పెళ్ళికి ఒక నెల ముందే అబ్బాయి తన కులం, మతం, ఆదాయం వెల్లడించాల్సి వుంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఇవీ చదవండి..