భార్య వేధింపులు భరించలేక ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తన ఇంటిముందున్న బైక్ , కార్లకు నిప్పుపెట్టారు. రెండేళ్ల క్రితం చెన్నైకి చెందిన సతీష్ భార్యతో గొడవలొచ్చి విడిగా తల్లి ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే రోజూ ఫోన్ చేసి ఆమె తనను వేధింపులకు గురిచేస్తోందని పలుదఫాలు కేసులు కూడా పెట్టాడు. మొన్నటి రోజు రాత్రి ఫోన్ చేసి తీవ్రమైన వేధింపులకు గురిచేసింది. దీంతో డిప్రెషన్ తో తానే వీధిలో తన ఇంటి ముందే ఉన్న భార్య బైకుకి నిప్పు పెట్టానని , దాంతో పక్కనున్న వాహనాలకూ మంటలు అంటుకున్నాయని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు..