కడప జిల్లాలోని బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని టిడిపి నిర్ణయించుకుంది. వైసిపి అభ్యర్థిగా , చనిపోయిన ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య భార్యకే టికెట్ ఇవ్వడంతో , పోటీనుంచి విరమించుకోవాలని తీర్మానించారు. నిన్ననే జనసేన అభ్యర్థి కూడా రంగంలో ఉండరని పవన్ కళ్యాణ్ చెప్పారు. బిజెపి మాత్రం అభ్యర్థిని నిలిపే ఆలోచనలో ఉంది. ఈ రోజు సమావేశమైన టిడిపి పొలిట్ బ్యూరో సమావేశం , గత సంప్రదాయాలను గౌరవించి బద్వేల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్టు చెప్పింది.