కలతీరేలోగా ,కరోనా బలితీసుకుంది.. జీవితాశయాన్ని విధి యమపాశమై చంపేసింది.. 30 ఏళ్ళ అవినాష్ కరొనతో 24 తేదీ చనిపోయాడు.. చనిపోయిన వారానికి అతడు డిఎస్పీ , లేదా డెప్యూటీ కలెక్టర్ పోస్టుకు ఎంపికైనట్టు సమాచారం వచ్చింది.. పాట్నాకు చెందిన అవినాష్ , బిటెక్ పూర్తిచేశాడు. బీహార్ పబ్లిక్ సర్వీస్ పరీక్షలకోసం రేయింబవళ్లు చదివాడు. మొదటి ప్రయత్నంలోనే పాసైయ్యాడు.. అయితే సమాచారం వచ్చే వారం ముందే కరొనకు బలైపోయాడు.. విధి ఎంత క్రూరమైనదో చూడండి..