తెలంగాణలో కొత్తగా ఏర్పడిన వైఎస్సార్టీపీ పార్టీ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తుందా, షర్మిల అక్కడ తన అభ్యర్థిని నిలబెడతారా.. అనే అనుమానాలపై క్లారిటీ వచ్చింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్టీపీ పోటీ చేయడంలేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. హుజూరాబాద్ ఎన్నికలతో ఏమైనా ప్రజలకు ఉపయోగం ఉందా అని ఆమె ప్రశ్నించారు. పగలు,ప్రతీకారాలతో వచ్చిన ఎన్నికలుగా వాటిని ఆమె పేర్కొన్నారు.
హుజూరాబాద్ ఎన్నికలు ఇప్పుడు అవసరమా అని ప్రశ్నించారు షర్మిల. హుజూరాబాద్ ఉప ఎన్నికతో ఏం వస్తోందని ఆమె అడిగారు.రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తే హుజూరాాబాద్లో పోటీ చేస్తామన్నారు.హుజూరాబాద్ ఉప ఎన్నికలకు అర్ధమే లేదన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలు వచ్చిన తీరుపై ఆమె సెటైరికల్ గా స్పందించారు.ఈ ఎన్నికలతో ప్రజలకు ఏం ఒరుగుతుందని ఆమె ప్రశ్నించారు. ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉంటే పోటీ చేసేందుకు తాము సిద్దమని ఆమె చెప్పారు.
ఇవీ చదవండి..