సారా శర్మ.. ఈ అమ్మడు గుర్తుందా..? అప్పుడెప్పుడో 2012లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. డిస్కో అనే మూవీలో నిఖిల్ సరసన హీరోయిన్ గా కనిపించింది. ఆ మూవీ డిజాస్టర్ గా మిగిలిపోయాక ఇక బాలీవుడ్ కు మకాం మార్చేసింది. ఆ తర్వాత చిన్నా చితకా పాత్రలు వేసుకుంటూ.. కాస్త పాపులారిటీ తెచ్చుకుంది. అయితే తాజాగా సారా శర్మ ఓ వివాదాన్ని సృష్టించి.. వార్తల్లోకెక్కింది..
అదేమిటంటే.. మోహిత్ రైనా అనే బాలీవుడ్ యాక్టర్.. చావుకు దగ్గరలో ఉన్నాడంటూ ఉద్యమాన్ని మొదలెట్టింది. గతంలో సూసైడ్ చేసుకొని చనిపోయిన సుశాంత్ రాజ్ పుత్ లాగానే మోహిత్ కూడా మానసిక వేదనలో ఉన్నదంటూ ప్రచారం చేసింది. మరో ఇద్దరితో కలిసి అతగాడిని బ్లాక్ మెయిల్ చేసింది. దీంతో మోహిత్ రైనా హైకోర్టుకు వెళ్ళాడు.. ఇలా అసత్యాలను ప్రచారం చేయడంతో పాటూ.. బ్లాక్ మెయిల్ చేయడంతో ఇప్పుడు సారా శర్మపై కేసు బుక్ చేశారు..