పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోవడం ఇటీవల సర్వసాధారణమై పోయింది. గతంలో పెళ్లి ఆగిందంటే అది పెద్ద సంచలనంగా మారేది.. కానీ నేటి రోజుల్లో చిన్న చిన్న కారణాలతోనే పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా అమ్మాయిలు, అబ్బాయిల అభిప్రాయాల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. దీంతో చిన్న కారణాలతోనే పెళ్ళిళ్ళను ఆపేస్తున్నారు. గతంలోనూ రెండవ ఎక్కం చెప్పలేదని పీటలపైనే పెళ్లిని ఆపేసింది ఒక వధువు..
తాజాగా యూపీలోని దవార్ అనే గ్రామంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. కాసేపట్లో మూడు ముళ్ళు వేయించుకోవాల్సిన వధువు పెళ్ళికి నో చెప్పేసింది. వధువు తల్లిదండ్రులు, బంధువులు ఎందరు చెప్పినా ఆ యువతి మాత్రం పెళ్ళికి ఒప్పుకోలేదు. అయితే ఇలా అర్ధాంతరంగా పెళ్లి వద్దని చెప్పడానికి కూడా కారణం చెప్పింది. పెళ్ళికొడుకు పీటలపై ఎక్కే ముందు గుట్కా నమలడం ఆ వధువు చూసిందట.. అందుకే పెళ్లి వద్దని ఖరాకండీగా చెప్పేసింది. దీంతో చేసేదేమీ లేక వరుడు.. వధువు వైపు వారు ఎవరిళ్ళకు వారు వెళ్లిపోయారు..
ఇవీ చదవండి..
నూర్జహాన్ మామిడి.. ఒక్కోటి వెయ్యి రూపాయలు..
ఈ ముసలోడికి 37 వ పెళ్లి.. అమ్మాయికి 16 ఏళ్ళు.
అరటిపండు టీ ఎందుకు తాగాలి.. ?
నెల్లూరు హాస్పిటల్లో పెద్ద డాక్టర్ నీచ శృంగార పురాణం..