ఒలింపిక్స్ భారత్ కు స్వర్ణం తెచ్చి , మరో చరిత్రకు శ్రీకారం చుట్టిన నీరజ్ చోప్రాకు దేశం నీరాజనం పట్టింది. ప్రధాని ఫోన్ చేసి నీరజ్ ను అభినందించారు.. ఒలింపిక్స్ లో నీరజ్ స్వర్ణం చేజిక్కుంచుకున్నాడన్న వార్తతో , దేశం ఒక్కసారిగా ఆనందోత్సాహంలో మునిగింది. హర్యానా రాష్ట్రం ఆయనకు 6 కోట్లు రూపాయలు బహుమతి ప్రకటించింది. గ్రేడ్ వన్ ఉద్యోగం కూడా ఆఫర్ చేసింది. పంజాబ్ ప్రభుత్వం 2 కోట్లు , మణిపూర్ ప్రభుత్వం ఒక కోటి , చెన్నై సీఎస్ కె , ఒక కోటి.., బిసిసిఐ 1 కోటి , ఇలా గంటల వ్యవధిలో 11 కోట్లు నగదు నజరానాలు ప్రకటించారు. హర్యానాలోని ఒక కుగ్రామంలో ఉన్న నీరజ్ ఇంటిముండేకాదు, హర్యానామొత్తం బాణాసంచాపేలుళ్లతో , బాజాభజంత్రీలతో సంబరాలు జరుపుతుంది.. మహీంద్రా కంపెనీ తరపున నీరజ్ కు ఒక suv – 700 గిఫ్ట్ గా ఇస్తున్నట్టు ఆనంద్ మహీంద్రా ప్రకటించారు.. ప్రధాని మోడీతో , నీరజ్ ఫోన్ లో సంభాషణ ఇలా సాగింది .. వినండి.
When Hon @narendramodi ji calls and speaks to @Neeraj_chopra1 https://t.co/EWF1exIHMy#IndiaAtOlympics #Tokyo2020 #TokyoOlympics #NeerajChopra #goldmedal #Gold #Cheer4India #History pic.twitter.com/eBxLFf4L4K
— Devendra Fadnavis (@Dev_Fadnavis) August 7, 2021