బాలీవుడ్ నటి కాజోల్ 47వ పుట్టినరోజు ఆగస్ట్ 5న జరుపుకుంది. కరోనా నేపధ్యంలో సింపుల్ గా చేసుకుంది. అయితే కొందరు అభిమానులు, యువకులు, పిల్లలు కలిసి కాజోల్ కోసం ప్రేమగా కేక్ కొని, ఆమె ఇంటికి వచ్చారు. మెయిన్ డోర్ బయటకి వచ్చి అక్కడే నుంచే కేక్ కట్ చేసింది కాజల్. ఆమె కేక్ కట్ చేస్తున్న సమయంలో పిల్లలు చక్కగా హ్యాపీ బర్త్ డే టు యూ అంటూ పాటలు కూడా పాడారు. అయితే ఫ్యాన్స్ ఒక్క కేక్ పీస్ తినండని కోరడంతో, అందుకు నిరాకరిస్తూ చకాచకా వెనుతిరిగి వెళ్ళిపోయింది. దీంతో ఫ్యాన్స్ కాస్త హర్ట్ అయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలోకి రావడంతో.. కాజోల్ పై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాజోల్ బిహేవియర్ ఏమాత్రం సరిగా లేదు. స్క్రీన్ మీద కనిపించినట్లు, రియల్ లైఫ్లో కనిపించడం లేదంటూ చీవాట్లు పెడుతున్నారు. ఎంత పెద్ద హీరోయిన్ అయితే మాత్రం ఫ్యాన్స్ తో ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదంటూ కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram