కరోనా కష్టకాలంలో ఉన్నవారు తనకి మెసేజ్ చేయండి సహాయం చేస్తానంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టిన రేణూదేశాయ్.. ఇప్పుడు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. సహాయం చేస్తానని ఆమె మాటిచ్చిన సందర్భంలోనే ఆర్థిక సాయం అడగకండి, కేవలం వస్తువులు, మందులు అడగండి అని ఆమె చెప్పారు. అయితే చాలామంది ఆర్థిక సాయం కోసం ఆమెకు మెసేజ్ లు పెడుతున్నారు. ఆమె వాటిని సున్నితంగా తిరస్కరిస్తున్నారు కూడా.
ఈ క్రమంలో కొంతమంది… మీరు డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ రేణూదేశాయ్ కి మెసేజ్ లు పంపించారు. ఒకరకంగా ఆమెను బ్లాక్ మెయిల్ చేశారు కూడా. దీంతో రేణూదేశాయ్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాదు.. పోలీస్ కంప్లయింట్ ఇస్తాను జాగ్రత్త అని హెచ్చరించారు.
https://www.instagram.com/p/CPXaPdwB95-/?utm_source=ig_web_copy_link