మన దేశంలో చాలా మంది డాక్టర్లు, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు, మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ అడ్డంపెట్టుకుని కోట్లు దోచుకుంటున్నారు. ఎవరి మీదా చర్యలు ఉండవు. అదేదో లైసెన్స్ ఇచ్చిన మోసం లాగే సాగిపోతుంది… అమెరికాలో చూడండి.. త్రివిక్రమ్ రెడ్డి అనే మెడికల్ ప్రొఫెషనల్ మూడు నర్సింగ్ హోమ్ లు పెట్టి దొంగ బిల్లులతో ఇన్సూరెన్స్ కంపెనీలను కోట్లు కొల్లగొట్టాడు.. దీంతో పోలీసులు కేసు పెట్టి జైల్లో వేశారు. ఇప్పుడు త్రివిక్రమ్ రెడ్డికి, చేసిన మోసాలకు 20 ఏళ్ల జైలు, 376 కోట్ల రూపాయల ఫైన్ వేశారు… ఇదే మన దేశంలో సాధ్యమా…?? ఆలోచించండి…