ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ యూపీలోని రాంపూర్ కోర్టు స్ఫష్టం చేసింది.. షానాబాద్ , సువారా అనే ప్రాంతాలకు చెందిన ఇద్దరమ్మాయిలు గతకొద్దిరోజులుగా అదృశ్యమయ్యారు. వీరిద్దరూ రాంపూర్ లో ఉన్నారని తెలుసుకున్న పోలీసులు వారిని గుర్తించారు. తల్లి , తండ్రుల సమక్షంలో ఇద్దరినీ విచారించారు. తామిద్దరూ , మేజర్లని , సహజీవనం చేస్తున్నామని వారు తెలిపారు. చట్టపరంగా తామిద్దరికీ కలిసి జీవించే హక్కు ఉందని అన్నారు., ఇద్దరు యువతుల తల్లితండ్రులు ఎంతగా నచ్చజెప్పినా వాళ్ళు వినలేదు . దీంతో పోలీసులు ఇద్దరినీ కోర్టులో హాజరు పరిచారు. కేసు వివరాలు విన్న , న్యాయమూర్తి వారిద్దరినీ సహజీవనానికి అనుమతిస్తూ తీర్పు చెప్పారు.
ఇవీ చదవండి..