కరోనా వైరస్ బారిన పడితే పేదోళ్ల ఇళ్లల్లో ఇలాంటి ఐసోలేషన్ కేంద్రం బహుశా ప్రపంచంలో ఇదేనేమో.. ? ఇంట్లో నలుగురు సభ్యులు.. ఒకే గది.. అందుకే ఈ యువకుడు ఇంటికి దగ్గరలో ఉండే చెట్టకే మంచె ఏర్పాటుచేసుకుని ,దాన్నీ ఓపెన్ ఐసోలేషన్ కేంద్రంగా మార్చుకున్నాడు. నల్లగొండ జిల్లా కొత్తనందికొండ గ్రామానికి చెందిన రమావత్ శివ హైదరాబాద్లో బీటెక్ చదువుతున్నాడు. లాక్డౌన్ కారణంగా గ్రామానికి వచ్చిన శివ స్థానిక ఐకేపీ కేంద్రంలోకూలీ పనులకు వెళ్లాడు. తోటి కూలీలతో కలిసి పనిచేసే క్రమంలో కరోనాకు గురయ్యాడు. దీంతో తాను వేరుగా ఉండాలనుకొని ఇలా మంచె ఏర్పాటుచేసుకుని ఉండిపోయాడు.
A youth in #Telangana self-isolate in treehouses to avoid spreading the disease to vulnerable family. #RuralIndia #CovidIndia #COVIDー19 #COVIDEmergencyIndia pic.twitter.com/Naijbq0SAN
— Aashish (@Ashi_IndiaToday) May 15, 2021