అథ్లెటిక్స్ విభాగంలో భారత్ కి తొలి ఒలింపిక్ స్వర్ణం అందించిన నీరజ్ చోప్రా ఒక్కరోజులోనే జాతీయ హీరోగా మారిపోయారు. నీరజ్ పేరు ట్రెండ్ సెట్టర్ గా మారిపోయింది. ఇక ఆయనకు వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు, కంపెనీలు ప్రకటించిన నజరానాలకు లెక్కే లేదు. అయితే కేవలం నీరజ్ కే కాదు, నీరజ్ అనే పేరున్న వారికి కూడా బంపర్ ఆఫర్ ప్రకటించింది ఓ పెట్రోల్ బంక్..
Lovely Professional University will gift Rs 50 lakhs to #Olympics gold medalist Neeraj Chopra, who is pursuing BA from the university. They'll also reward bronze medalist wrestler Bajrang Punia with Rs 10 lakhs. Punia is pursuing his MA in Public Admn from LPU.
(File pics) pic.twitter.com/bP3FIHeDVk
— ANI (@ANI) August 9, 2021
ప్రభుత్వాలు నీరజ్ చోప్రాకు విలువైన బహుమతులు అందిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని కంపెనీలు నీరజ్ చోప్రాకు ఖరీదైన బహుమతులు అందిస్తున్నాయి. ఇదిలా ఉంటే, నీరజ్ పేరు ఉన్న వారికి కొన్ని చోట్ల ఉచిత పెట్రోల్ ఆఫర్ను ప్రకటించాయి. గుజరాత్ లోని భరూచ్ లో ఒ పెట్రోల్ బంకులో ఉచిత పెట్రోల్ ఆఫర్ ను ప్రకటించారు. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు ఈ ఆఫర్ అమలులో ఉంటుంది. నీరజ్ పేరున్న వ్యక్తులు ఐడీ కార్డు చూపి ఉచితంగా పెట్రోల్ పొందవచ్చు. జునాగడ్ లోని గిర్నార్ రోప్ వే కంపెనీ నీరజ్ పేరున్న వ్యక్తులు ఉచితంగా రోప్ వేలో ప్రయాణం చేసే అవకాశం కల్పించింది. ఈ అవకాశం ఆగస్ట్ 20 వరకు ఉంటుందని ఆ సంస్థ తెలియజేసింది.