మెగా ఫ్యామిలీ ని బజారుకీడ్చిన పోసాని బూతుపురాణాలు మధ్య జనసేన సమావేశానికి పవన్ కళ్యాణ్ విజయవాడ వచ్చారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఆయన చాలా సీరియస్ గా కనిపించారు. మీడియా వంక చూడకుండానే కారెక్కి వెళ్లిపోయారు. గతంలో ఎప్పుడూ పవన్ ఇంత గంభీరంగా లేరు. ఆయన ఎయిర్ పోర్ట్ నుంచి జనసేన రాష్ట్ర కమిటీ సమావేశంజరిగే , పార్టీకార్యాలయానికి వెళ్లిపోయారు.ఒక రాజకీయపార్టీ అధ్యక్షుడుగా ఉన్న పవన్ పై మంత్రి పేర్నినాని , పోసాని చేసిన ఆరోపణలపై పార్టీలో చర్చించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత , కుటుంబ జీవితాలపై తీవ్రస్థాయిలో చేసిన ఆరోపణలతో జనసేనలో కూడా కల్లోలం మొదలైంది. సంయనం పాటించడమా ..? పోరాటానికి సిద్ధం కావడమా ..? అన్న విషయమే తేలాల్సివుంది.
ఇవీ చదవండి..