దిల్ రాజ్ కౌర్ .. ఒకప్పుడు దేశంలో మార్మోగిన పేరు.. పారా ఒలింపిక్స్ తో సహా , అన్ని జాతీయ , అంతర్జాతీయ ఎయిర్ రైఫిల్ పోటీల్లో ఆమె విజేత.. 15 కి పైగా బంగారు , వెండి పతకాలు గెలిచింది.. అనేక సెలెక్షన్ కమిటీలలో మెంబర్ గా కూడా ఉంది.. లా చదివింది.. కానీ ఇప్పుడేమి చేస్తుందో తెలుసా..? రోడ్డుపక్కన చిప్స్ అమ్ముకుంటుంది.. ఉదయం మార్కెట్లో , సాయంత్రం పార్కుల పక్కన ఇలా రోడ్డు మీదనే చిప్స్ అమ్ముకుంటుంది.. ఒక జాతీయ స్థాయి క్రీడాకారిణికి ఇంత దుస్థితి , బహుశా మరే దేశంలోనూ ఉండదు.. తల్లి , తానూ పొట్ట నింపుకునేందుకే , ఆమె రోడ్డు పక్కన డెహ్రాడూన్ లో ఇలా చిప్స్ అమ్ముకుంటుంది..
గత ఏడాది తండ్రి కరోనా కాటుకు బలయ్యాడు.. సోదరుడు భవనం మీదనుంచి పడి తల దెబ్బతగిలింది.. రెండు నెలలు కోమాలోనే పోరాడి చనిపోయాడు.. దీంతో ఉన్న ఇల్లు , డబ్బు అయిపోయి , అప్పులపాలై వీధిన పడ్డారు.. చిన్న రేకులింట్లో తలదాచుకుని ఆకలి తీర్చుకునేందుకు ఇలా వీధిలో పల్లీలు , చిప్స్ అమ్ముకుంటున్నారు. ఇలాంటి క్రీడాకారులకు ఇతర రాష్ట్రాలలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలిస్తున్నారు. కానీ ఉత్తరాఖాండ్ లో మాత్రం దిల్ రాజ్ కౌర్ ఇలా కడుపుకూటి కోసం వీధిలో పల్లీలు , చిప్స్ అమ్ముకుంటోంది.. ఈ విషయం సోషల్ మీడియాలో రావడంతో దిల్ రాజ్ కౌర్ కు ఉద్యోగం కల్పించే అవకాశం పరిశీలిస్తామని ఉత్తరాఖండ్ క్రీడల మంత్రి చెప్పారు..