తల్లి అక్రమ సంబంధానికి కొడుకు బలి..

    0
    1576

    తల్లి ఓ వ్యక్తితో కలసి ఉండగా చూసిన పదేళ్ల బాలుడు, మరుసటి రోజుకి శవం అయ్యాడు. ఈ ఘోరంలో బిడ్డను చంపిన నేరం ప్రియుడిది. తల్లికి ఈ విషయం తెలియదు. బీహార్ లోని ముజఫర్ పూర్ జిల్లా లక్ష్మీనియా గ్రామంలో 30ఏళ్ల సంజయ్ పండిట్, 45ఏళ్ల ఓ వివాహితతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆ వివాహితకు నీరజ్ కుమార్ అనే పదేళ్ల బాలుడు ఉన్నాడు.

    ఓరోజు సంజయ్ పండిట్ తన తల్లితో సన్నిహితంగా ఉన్న సమయంలో నీరజ్ కుమార్ చూశాడు. దీన్ని గమనించిన సంజయ్ పండిట్.. పదేళ్ల ఆ బాలుడు తమ అక్రమ సంబంధం విషయాన్ని ఎక్కడైనా బయటపెడతాడేమోనని భయపడ్డాడు. నీరజ్ కుమార్ ని తనతోపాటు తీసుకెళ్లి చంపేశాడు. చంపే ముందు అతడిని లైంగికంగా వేధించినట్టు తెలుస్తోంది. ఈ విషయం సదరు వివాహితకు తెలియదు. కొడుకు కనిపించకపోవడంతో ఆమె తల్లడిల్లిపోయింది. చివరకు ప్రియుడిని నిలదీడయంతో అతడు విషయం బయటపెట్టాడు. తనే ప్రియురాలి కొడుకుని హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు సంజయ్ పండిట్ ని అరెస్ట్ చేశారు.

    ఇవీ చదవండి..

    లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

    వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

    అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

    కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..