ఫీజులు చెల్లించలేదని ఆన్ లైన్ క్లాసుల లింకు నుంచి విద్యార్థులను తొలగించడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది సమంజసమేనా .అని నిలదీసింది. విద్య ప్రాథమిక హక్కు అన్న ప్రాధమిక సూత్రానికి ఇది విరుద్ధంకాదా అని ప్రశ్నించింది. ఫీజు చెల్లించడంలో జాప్యం జరిగితే ఆన్ లైన్ క్లాసులు నిలిపేయడం ఎంతవరకు సమంజసం అని నిలదీసింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్పై పబ్లిక్ స్కూల్ యాక్టివ్ పేరెంట్స్ ఫోరం చేసిన అప్పీల్పై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణచేపట్టింది. కరోనా కష్టకాలంలో మానవత్వంతో ఉండాలని తెలియదా అని నిలదీసింది. సుప్రీంకోర్టు ఆదేశాలప్రకారం మీరు ఫీజులు వసూలు చేస్తున్నారా అనికూడా ప్రశ్నించింది.