ఎలక్ట్రిక్ స్కూటర్లు భారత్ లో దుమ్మురేపనున్నాయి. ఇప్పటికీ చాలా కంపెనీలు తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను భారత మార్కెట్లో ప్రవేశ పెట్టాయి. అయితే ఇప్పుడు ఓలా కూడా తన ఎలక్ట్రిక్ స్కూటర్ ను మనదేశంలో విడుదల చేయనుంది. ఈ స్కూటర్ దేశంలో సరి కొత్త ట్రెండ్ని సృష్టిస్తుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దానికి ప్రధాన కారణం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఉండే టాప్ క్లాస్ ఫీచర్లు.. ద్విచక్రవాహనాల్లో చాలా అరుదుగా ఉండే రివర్స్ మోడ్ను దీనిలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఈ స్కూటర్లో రివర్స్ మోడ్ ఫీచర్ అందిస్తున్నట్లు కంపెనీ సీఈవో సీఈఓ భవీష్ అగర్వాల్ ప్రకటించారు.
ఓలా స్కూటర్ను 18 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ చేయొచ్చు.. సగం ఛార్జింగ్తో 75 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. వీటితో పాటు తాళం చెవి లేకుండానే ఓ ప్రత్యేకమైన యాప్ ద్వారా స్కూటర్ను స్టార్ట్ చేసే అత్యాధునిక ఫీచర్ కూడా ఇందులో ఉండటం విశేషం..
ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే, జీపీఎస్ నావిగేషన్ కూడా ఈ స్కూటర్ స్పెషాలిటీల్లో ఒకటి.. బ్లూటూత్ ద్వారా 4జీ కనెక్టివిటీ సౌకర్యం, అతి పెద్ద క్లాస్ బూట్ స్పేస్, యాప్-బేస్డ్ కీలెస్ యాక్సెస్, సెగ్మెంట్-లీడింగ్ రేంజ్ వంటి ఫీచర్లతో ఈ స్కూటర్ ముస్తాబవుతోంది. డ్యూయల్ ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్, సింగిల్-పీస్ సీట్, ఎక్స్టర్నల్ ఛార్జింగ్ పోర్ట్, ఎల్ఈడీ డిఆర్ఎల్, ఎల్ఇడి టైల్లైట్, సామాను తీసుకెళ్లేందుకు హుక్, స్ప్లిట్-టైప్ రియర్ గ్రాబ్ హ్యాండిల్స్, బ్లాక్ కలర్ ఫ్లోర్ మత్, పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లు కూడా ఇందులో ఉంటాయి.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న ఈ స్కూటర్ను మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ఈ ఓలా స్కూటర్ ధర లక్ష రూపాయల నుంచి లక్షా 20 వేల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మన దేశంలో లక్ష బుకింగులు కూడా జరిగినట్టు కంపెనీ ప్రకటించింది.
!won em ot netsiL
A revolution to Reverse climate change! See you on 15th August at https://t.co/lzUzbWbFl7 #JoinTheRevolution @OlaElectric pic.twitter.com/WXXn3sD8CN— Bhavish Aggarwal (@bhash) August 7, 2021