భారత్ లో కొవిడ్ కేసులు 2 నెలల కనిష్టానికి చేరుకున్నాయి. ఓ దశలో 4 లక్షలు దాటి భయపెట్టిన కేసులు ఇప్పుడు లక్షకు చేరుకున్నాయి. తాజాగా 1,00,636 మందికి కరోనా సోకింది. క్రితం రోజుతో పోల్చితే 12 శాతం తగ్గుదల కనిపించింది. గడిచిన 24 గంటల్లో 2,427 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక రికవరీ రేటు 94శాతానికి చేరువైంది. మొత్తం రికవరీలు 2.7కోట్ల మార్కును దాటాయి. నిన్న ఒక్కరోజే 1,74,399 మంది కోలుకున్నారు.
COVID-19 Testing Update. For more details visit: https://t.co/dI1pqvXAsZ @MoHFW_INDIA @DeptHealthRes @PIB_India @mygovindia @COVIDNewsByMIB #ICMRFIGHTSCOVID19 #IndiaFightsCOVID19 #CoronaUpdatesInIndia #COVID19 #Unite2FightCorona pic.twitter.com/9MgLjcCQsm
— ICMR (@ICMRDELHI) June 7, 2021
రికవరీ రేటు 94 శాతానికి చేరువగా కాగా..క్రియాశీల రేటు 5శాతం దిగువకు నమోదైంది. ప్రస్తుతం 14,01,609 మంది కొవిడ్తో బాధపడుతున్నారు. మరోవైపు ఆదివారం 13.90లక్షల మందికి టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 23 కోట్లకు పైబడింది.
ఇప్పటివరకు భారత్ లో మొత్తం 2,89,09,975 మంది వైరస్ బారిన పడగా.. 3,49,186 మంది చనిపోయారు.