న్యాయమూర్తుల తీర్పుల్లో చట్టమేకాదు , మానవత్వంకూడా ఉండాలి.. చట్టం చూడలేని మానవతా కోణంలో న్యాయమూర్తి చూడగలిగితే , అదే నిజమైన న్యాయం ,,అతడే ఆకలి విలువ తెలిసిన న్యాయమూర్తి అవుతాడు.. వెన్న దొంగిలించిన శ్రీకృష్ణుడు చర్యను మనమంతా పొగిడితే , దాన్నే చెప్పుకొని ఆనందపడితే , ఆకలికి మిఠాయిలు దొంగిలించిన చిన్న పిల్లాడు దొంగెలా అవుతాడని నలంద జువనైల్ కోరు జడ్జి మానవేంద్ర మిశ్రా ప్రశ్నించాడు.
ఏడేళ్ల పిల్లాడు, తండ్రికి కళ్ళు లేవు , తల్లి పిచ్చిది.. భిక్షాటనకు పోతేనే కడుపు నిండేది.. అలాంటి పరిస్థితుల్లో 17 తేదీ యాచనకు పోలేదు.. పిల్లాడికి ఆకలేస్తే ఒక ఇంట్లో ఫ్రిడ్జ్ తీసి , స్వీట్స్ తీసుకొని తిన్నాడు. ఆమె పోలీసుకు పట్టిచ్చింది. పోలీసు ఆ పిల్లాడిని జువనైల్ కోర్టుకు హాజరు పరిచారు. అసలు విషయం కనుక్కున్న జడ్జి , పోలీసులను మందలించారు. చైల్డ్ వెల్ఫేర్ బోర్డుకి బాలుడిని అప్పజెప్పి , చదువు చెప్పించి , మంచి హాస్టల్లో చేర్చాల్సిందిగా సూచించారు..
ఇవీ చదవండి..