ఏపీ మంత్రి వర్గ విస్తరణలో ఈసారి అంతా కొత్తమొహాలే కనిపిస్తాయని అంటున్నారు మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి. ఏపీ మంత్రివర్గంలో త్వరలో భారీ మార్పులు జరుగుతాయని అన్నారాయన. మంత్రి వర్గంలో వందశాతం కొత్తవారిని తీసుకుంటామని సీఎం జగన్ చెప్పారని, విధాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సీఎంకు తాను స్పష్టం చేశానని అన్నారు. మంత్రి పదవి పోయినా తాను భయపడనన్నారు. తనకు పార్టీ ముఖ్యం కానీ పదవులు కాదని పేర్కొన్నారు బాలినేని.
మంత్రివర్గాన్ని వంద శాతం మారుస్తానని సీఎం జగన్ గతంలోనే చెప్పారని మంత్రి బాలినేని అన్నారు. మంత్రి వర్గాన్ని వంద శాతం మారిస్తే మంచిదేనని సీఎంకు తన అభిప్రాయాన్ని తెలిపానన్నారు.
ఇవీ చదవండి..