కోటీశ్వరుడి ఇంట్లో పెరిగే కుక్క లైఫ్ స్టయిల్ కూడా రాయల్టీగానే ఉంటుంది. రెండు రోజుల క్రితం ఓ కుక్క ముంబై నుంచి చెన్నైకి ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్ లో ప్రయాణం చేసింది. గతంలో పెంపుడు కుక్కలను విమానంలో తీసుకెళ్ళడం కొత్తేమీ కాకపోయినా, ముంబై నుంచి చెన్నైకి ప్రయాణం చేసిన ఓ కోటీశ్వరుడు మూడు లక్షలు పెట్టి తనకోసం, తన కుక్క కోసం మొత్తం బిజినెస్ క్లాస్ అంతా బుక్ చేసుకున్నాడు. ఆ ఎయిర్ ఇండియా ఏ320 విమానంలో జే బిజినెస్ క్లాస్ లో 12 సీట్లు ఉంటాయి. ఆ 12 సీట్లు బుక్ చేశాడు. ఎయిర్ ఇండియా నిబంధనల ప్రకారం పెంపుడు కుక్కలు, పిల్లలు, పక్షులను అనుమతిస్తారు. అయితే వాటి ఆరోగ్యం, ర్యాబిస్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ చూపించాల్సి వుంటుంది. ఆ జంతువు బరువును బట్టి రెండు పెంపుడు జంతువులను మాత్రమే అనుమతిస్తారు. ఇటీవల బ్రిటన్ లో కూడా ఓ చిన్న పెంపుడు కంగారుని విమానంలో తీసుకొచ్చి సంచలనం సృష్టించారు. ఇప్పుడు మన దేశంలో ఏకంగా పెంపుడు కుక్క కోసం ఏకంగా బిజినెస్ క్లాస్ నే బుక్ చేసిన వార్త వైరల్ అయింది.
ఇవీ చదవండి..