మీ ఊరొస్తా.. మీ మంచంపై కూర్చుంటా..

    0
    418

    కృష్ణాజిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తీరే వేరు. ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేసిన రోజుల్లో కూడా ఆయన తనదైన శైలిలో వ్యవహరించారు. నేరాలను అదుపులో పెట్టారు. అంతే కాదు, ఆయన జనాల్లోకి వెళ్లే తీరు, జనాలతో కలసిపోయే తీరు కూడా చాలా సహజంగా ఉంటుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు సందర్భంగా పలు గ్రామాల్లోకి వెళ్లిన ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్.. అక్కడే వారితో కలసి మంచంపై కూర్చుని పలు సూచనలు చేశారు. ఎక్కడా సంబరాలు జరపొద్దని చెప్పారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని చెప్పారు. గొడవలు పెట్టుకోవద్దని సూచించారు.

    కృష్ణాజిల్లాలో మహిళలకు అండగా నిలిచారు ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. బాధిత మహిళల ఇంటికి నేరుగా వెళ్లి వారి కుటుంబాలను పరామర్శించి వచ్చేవారు. ఈ క్రమంలో స్థానికులనుంచి ఆయనకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.