భర్తను చంపి ఇంట్లో పూడ్చి, మరిదిని చంపి కుక్కలకు వేసి..

    0
    437

    మరిదితో అక్రమసంబంధంతో ఊర్మిళ , ఐదేళ్ల క్రితం భర్త రంజిత్ ను చంపేసింది.. ఇంట్లోనే పూడ్చేసింది.. మరిదితో కాపురం మొదలుపెట్టింది.. ఇప్పుడు మరిదిని కూడా చంపేసి కుక్కలకు ఆహారంగా వేసింది.. వినేందుకే భయంకరంగా ఉన్న ఈ సంఘటనలో ఆ కసాయి మహిళ చెపుతున్న మాటలు విని పోలీసులకే మతిపోయింది. భోపాల్ లోని కోలార్ అనేప్రాంతంలో దంకేవాడ కాలనీలో ఈ దారుణం జరిగింది. ఐదేళ్ల క్రితం భర్తను చంపేసిన భార్య , మరిది మోహన్ సాయంతో వంటగదిలో గొయ్యి తీసి , భర్త శవాన్ని పూడ్చేసింది. భర్త తనను వదిలి , వేరే మహిళతో వెళ్లిపోయాడని చెప్పింది. ఒక బిడ్డతో , మరిదితో సహజీవనం చేస్తోంది.. ఇటీవల ఓ వ్యక్తి శవాన్ని కుక్కలు పీక్కుతింటున్నాయని పోలీసులకు ఫిర్యాదు అందింది.. అతడిని మోహన్ గా గుర్తించారు.. దీంతో పోలీసులు  ప్రశ్నిస్తే , గతంలో తన భర్తను తానే చంపి , ఇంట్లోనే పూడ్చేశామని చెప్పింది. పోలీసులు ఆ శవాన్ని వెలికి తీసి పోస్ట్ మార్టం కి పంపారు.. మరిది మోహన్ , తనను తరచూ వేధిస్తున్నాడని , అందుకే కొడుకు సాయంతో చంపేసి ఊరిబయట కుక్కలకు ఆహారంగా వేశానని చెప్పింది..

    ఇవీ చదవండి..

    ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

    కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

    ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

    ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..