భారత్ లో సింగిల్ డోస్ టీకాకు ప్రభుత్వం అత్యవసర అనుమతి ఇచ్చింది. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తయారు చేసిన ఈ టీకా ఇకపై జనసామాన్యంలోకి రాబోతోంది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
India expands its vaccine basket!
Johnson and Johnson’s single-dose COVID-19 vaccine is given approval for Emergency Use in India.
Now India has 5 EUA vaccines.
This will further boost our nation's collective fight against #COVID19
— Mansukh Mandaviya (@mansukhmandviya) August 7, 2021
భారత్లో అత్యవసర వినియోగ అనుమతుల కోసం జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఈనెల 5న దరఖాస్తు చేసుకుంది. రోజుల వ్యవధిలోనే దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.
ప్రస్తుతం దేశంలో కొవాక్సిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్-వి టీకాలు అందుబాటులో ఉండగా ఇటీవలే అమెరికాకు చెందిన మోడెర్నా టీకా కూడా ఆ లిస్ట్ లో చేరింది. తాజాగా జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ టీకాకు కూడా ఆమోదం లభించింది. మిగతావన్నీ రెండు డోసుల టీకాలు కాగా.. జాన్సన్ కంపెనీది సింగిల్ డోస్ టీకా.