ఆనందయ్య మందుపై ముఖ్యమంత్రి జగన్ , ఆయుష్ అధికారులతో చర్చించారు.. కోవిడ్ నేపథ్యంలో రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలపై జరిగిన సమావేశంలో సీఎం ఆనందయ్య మందుపైకూడా చర్చించారు. ఈ విషయమై సోమవారం తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని రాష్ట్ర ఆయుష్ కమిషనర్ రాములుచెప్పారు. . ఈ మందు వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే జాగ్రత్తలు తీసుకొంటున్నట్టు చెప్పారు..ఆనందయ్య మందుపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు.‘ఆనందయ్య మందు విషయంలో కంటి మందుపై మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చెప్పారు. ఆనందయ్యమందుపై ఇప్పటివరకు వచ్చిన నివేదికలన్నీ సానుకూలంగానే ఉన్నాయని రాములు తెలిపారు.. ఈ మందుపై హైకోర్టులో దాఖలైన పిటీషన్ పై సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది. హైకోర్టు తీర్పు వచ్చాక మందు పంపిణీపై నిర్ణయం తీసుకుంమని రాములు తెలిపారు.