175 ఏళ్లుగా పంపిణీ చేస్తున్న హైదరాబాద్ చేపమందుకు ఈ ఏడాది కూడా బ్రేక్ పడింది.. ఉబ్బసం రోగులకు బత్తెన కుటుంబం తరతరాలుగా చేపమందు ఇస్తోంది.. కరోనా మహమ్మారి ఉదృతంగా ఉన్నకారణంగా దీన్ని నిలిపివేశారు.
గత ఏడాదికూడా ఇవ్వలేదు. చేపమందుకోసం , దేశ విదేశాలనుంచి వేలాదిమంది వస్తారు.. అయితే ఈ ఏడాది మందు పంపిణీ నిలిపివేసినా సంప్రదాయం ప్రకారం మృగశిరకార్తె ప్రవేశం రోజున ప్రతి ఏటా మాదిరిగానే జూన్ 7వ తేదీన దూద్బౌలిలోని తమ నివాసంలో సత్యనారాయణ వ్రతంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి 8వ తేదీన చేప ప్రసాదాన్ని తయారు చేసి ఉదయం 10 గంటలకు తమ కుటుంబ సభ్యులందరం తీసుకుంటామని.. అలాగే తమ దగ్గరి బంధువులకు పంపిణీ చేస్తామని బత్తిని హరినాథ్గౌడ్తెలిపారు.