కరోనా మహమ్మారి కారణంగా కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. ఒకరిని ఒకరు తాకాలంటే భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో మిజోరాం రాష్ట్రంలో ఓ వ్యక్తి తన భార్యకు కరోనా సోకడంతో, ఆమెను ఐసోలేషన్ కేంద్రానికి తీసుకెళ్లేందుకు వినూత్నంగా ఆలోచించాడు. తన జీప్ వెనుక ఓ ట్రాలీని అమర్చాడు. ఆ ట్రాలీలో ఓ కుర్చీ ఏర్పాటు చేసి భార్యను అందులో కూర్చోబెట్టాడు. ఆపై ఎంచక్కా భార్యను ఐసోలేషన్ కేంద్రానికి తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
husband taking his positive wife to quarantine centre in mizoram? pic.twitter.com/8XiP5SUWsI
— ?????_?????? (@elvis1708) May 31, 2021