కులం కన్నా గుణం గొప్పది… మతం కన్నా మానవత్వం ఇంకా గొప్పది… అని పెద్దలు ఊరికే అనలేదు. అందుకు ఈ ఘటనే ఓ ఉదాహరణ. ప్రపంచవ్యాప్తంగా కరోనా మారణహోమం సృష్టిస్తోంది. మనదేశం కూడా కరోనా విలయంతో కొట్టుమిట్టాడుతోంది. అన్నీబంధాలను కరోనా తునాతునకలు చేసేసింది. తల్లిబిడ్డలు, భార్యాభర్తలు, స్నేహితులు, బంధువులు, ఇలా అన్ని బంధాలు కోరలు చాచిన కరోనాకు భయపడి దూరమైపోయాయి.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మానవత్వం పరిమిళించేలా కర్నాటకలో ఓ ఘటన జరిగింది. ఓ హిందూ మహిళ అనారోగ్యంతో చనిపోయింది. కరోనా కూడా ఆమె లేదు. అయినా కరోనా భయంతో ఎవరూ ఆమెకు అంత్యక్రియులు నిర్వహించేందుకు ముందుకు రాలేదు. కుటుంబసభ్యులు కూడా వెనకడుగు వేశారు. అయితే స్థానికంగా ఉండే ముస్లింలు మాత్రం ఆమెకు అంత్యక్రియలు జరిపించేందుకు ముందుకు వచ్చారు. ఆమె పాడెను మోసుకుంటూ శ్మశానం వరకు వెళ్ళారు. హిందూ సంప్రదాయంలోనే ఆమెకు అంత్యక్రియలు పూర్తి చేసి, మానవత్వాన్ని నిలబెట్టారు. కులం కోసం, మతం కోసం కొట్టుకునే వాళ్ళు… తమ జాడ్యాన్ని ప్రదర్శించేందుకు ముందుకు పరిగెత్తేవాళ్ళు… ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మాత్రం అడుగు వేయలేకపోయారు. కానీ ఈ ముస్లిం సోదరులు మాత్రం మానవత్వాన్ని బతికించారు.
This is #OurIndia; this clip came as a forward, seems to be from #Karnataka; Last journey to funeral pyre, those who have come forward to lend a shoulder to carry body & complete rituals are men from another community who observe roza during the month of #Ramadan @ndtv @ndtvindia pic.twitter.com/345MeewByZ
— Uma Sudhir (@umasudhir) May 9, 2021