తమిళనాడు సీఎం స్టాలిన్ ను తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు, వేదపండితులు కలిసి ఆశీర్వాదం అందజేశారు. తిరుమల నుంచి తీసుకెళ్లిన పండ్లు, పూలు, స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. శాలువాలను స్టాలిన్ దంపతులకు కప్పి.. వేదమంత్రాలతో ఆశీర్వచనాలు అందజేశారు. సిద్ధాంత పరంగా నాస్తికత్వాన్ని నమ్మే డీఎంకే పార్టీలో.. ఆ పార్టీ నేత స్టాలిన్ సీఎం అయ్యాక.. తిరుమల ఆలయం నుంచి అర్చకులు వెళ్లి.. వేదాశీర్వచనం చేయడం ఇదే మొదటిసారి..