సుందరం ట్రావెల్స్ హీరోయిన్ రాధ మళ్ళీ పోలీసు స్టేషన్ కి ఎక్కింది.. తన రెండో భర్త వసంత్ రాజ్ , మరో లేడి ఎస్సై తనను హింసిస్తున్నారని , చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించింది. మూడు నెలల క్రితం ఇలాంటి ఆరోపణలతోనే పోలీసు ఫిర్యాదు చేసి కలకలం రేపింది..
ఒక షూటింగ్ లో ఎస్సై తో , కలిసిన పరిచయం సహజీవనం వరకు పోయింది. అప్పటికే ఎసై వసంత్ కు , పెళ్ళై ఇద్దరు బిడ్డలున్నారు. పై అధికారులు సర్ది చెప్పి , రాధతో కూడా కాపురం ఉండేట్టు చేసారు. తాను సిఐ ప్రమోషన్ లిస్ట్ లో ఉన్నానని , అందువల్ల కేసు డ్రాప్ చేసుకుంటే , కలిసి కాపురం చేద్దామని ఇద్దరూ అంగీకారానికి వచ్చి కలిసి ఉంటున్నారు.
ఇప్పుడు సడెన్ గా రాధ మళ్ళీ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. రాధ ఎనిమిదేళ్ళక్రితమే ఫైజల్ అనే వ్యక్తితో సహజీవనం చేసింది, తర్వాత అతడిని వదిలేసి మునివేల్ అనే నిర్మాతతో ఉండింది. ఎవరితో ఉన్నా , చివరకు పోలీసు కేసులు , గొడవలతోనే విడిపోయేది.. ఇప్పుడు ఎస్సై వసంత్ విషయంలోనూ అదే జరుగుతుంది.. ఎస్సై మాత్రం , రాధ తనతో ఉన్నప్పటికీ , ఇతరులతో సంబంధాలు కొనసాగిస్తుందని చెబుతున్నాడు..