బాలీవుడ్ నటి, పొలిటీషియన్ హేమమాలిని పర్సనల్ సెక్రటరీ మర్కంద్ మెహతా కరోనాతో కన్నుమూశారు.ఆయన మరణవార్త తెలియగానే హేమమాలిని కన్నీటి పర్యంతమయ్యారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ విలపించారు. “మర్కంద్ మెహతాతో తనకు 40 ఏళ్ళ అనుబంధం ఉంది. నా పర్సనల్ సెక్రటరీగా ఉన్నారు. నా కోసం, నా కుటుంబం కోసం ఎంతో శ్రమించారు. నా కుటుంబానికి అండగా నిలిచారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. నా కుటుంబంలో ఒక సభ్యుడిని కోల్పోయినట్లుగా ఉంది. ఆయన లోటు భర్తీ చేయలేనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలి.” అంటూ హేమమాలిని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.