ఈ బామ్మకు 97 ఏళ్ళు. ఈరోజుకీ తన పని తానే చేసుకుంటుంది. ఆమెది కంచుకంఠం. అలాంటి ఆ బామ్మ కోవిడ్ కష్టకాలంలో ఏం చెబుతుందో చూడండి. కరోనా విలయ తాండవంలో ఇప్పటికీ వ్యాక్సినేషన్ వేయించుకోవాలంటే భయపడుతున్నారు. గత ఆరు నెలలుగా ప్రభుత్వాలు కూడా వ్యాక్సినేషన్ విషయంలో అలక్ష్యం వహించడంతో మారణహోమం రాజ్యమేలుతోంది. అయితే ఈ బామ్మ మాత్రం వ్యాక్సినేషన్ అవసరాన్ని అందరికీ తెలియజెప్పేలా ఓ సందేశాన్ని వినిపించింది. అంతేకాదు వ్యాక్సిన్ తొలి డోసు వేసుకున్నానని, రెండో డోసు కోసం వెయిట్ చేస్తున్నానంటూ చెప్పుకొచ్చింది.
Hope this young lady can convert some sceptics pic.twitter.com/WYXpPMrKhd
— Latha Venkatesh (@latha_venkatesh) May 8, 2021