ఈ భార్య ఎంత నీచురాలో చూడండి.. బ్యాంక్ లోను కట్టాల్సివస్తుందని ప్రియుడితో కలిసి భర్తనే చంపేసింది.. ధర్మేంద్ర , సజలీదేవి భార్య భర్తలు.. వీరికి ఇద్దరు బిడ్డలు.. బ్యాంకు లో భర్త పేరుతొ 90 వేలు లోన్ తీసుకుంది. బ్యాంకు అధికారి రవిదాస్ , సజలీదేవితో అక్రమసంబంధం పెట్టుకున్నాడు. భర్తను చంపేస్తే బ్యాంకు లోను కట్టాల్సిన అవసరంలేదని ఇద్దరూ కుట్రచేసారు.
తర్వాత కలిసి సహజీవనం చెయ్యొచ్చునని భావించారు. దీంతో 50 వేలకు కిరాయి హంతకుడిని మాట్లాడింది. 20 వేలు అడ్వాన్స్ ఇచ్చి , పధకం వేసింది. సోమవారం రాత్రి ఇంటి తలుపుతీసి కిరాయి హంతకుడిని లోపలకు పిలిచింది. నాటు తుపాకీతో భర్తను కాల్పించి చంపించింది. తర్వాత స్పృహ తప్పినట్టు నటించింది.. పోలీసులు విచారణలో ఆమెపైనే అనుమానం రావడంతో , తన నేరం ఒప్పుకుంది.. బీహార్ జిల్లాలోని కతియార్ జిల్లా బత్తాటోలలో జరిగిందీ దారుణ ఘటన..