ప్రేమించాడు.. పెళ్లిచేసుకున్నాడు.. పెళ్ళైన వారానికే వద్దుపొమ్మన్నాడు.. దీంతో ఆ యువతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది.. తెలంగాణలోని ఇల్లెందు మండలం స్టేషన్ బస్తీకి దినేష్ శృతి ప్రేమించుకున్నారు. పాల్వంచ పెద్దమ్మ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. కొత్తగూడెంలో కాపురం పెట్టారు. దినేష్ తల్లితండ్రులు వచ్చి అతడిని తీసుకెళ్లారు. అత్తగారింటికి వెళ్లిన శృతిని బయటకు నెట్టేశారు. దినేష్ కూడా , తల్లి తండ్రులకే మద్దతుఇచ్చాడు. నువ్వంటే నాకిష్టం లేదని చెప్పేశాడు. పెళ్ళైన వారానికే ఇలా కావడంతో , ఆమె పోలీసులకు మొరపెట్టుకుంది. కౌన్సిలింగ్ ఇచ్చినా ఫలితంలేకపోవడంతో , శృతి ఆత్మహత్యా ప్రయత్నం చేసి , చావు బతుకులమధ్య ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది..