ట్రాఫిక్ కు అడ్డంగా నిలిపేసిన కారు తీయమంటే , వాళ్ళు కత్తులు తీసి వీరంగం చేసారు.. హిమాచల్ ప్రదేశ్ లోని కులూమనాలిలో యాత్రికుల రద్దీ ఎక్కువైంది. మనాలిలో గతరాత్రి మెయిన్ రోడ్డులో వాహనాలు నిలిచిపోయాయి . పంజాబ్ కు చెందిన నలుగురు యువకులు , కారులో మద్యం తాగుతూ , రోడ్డుకు అడ్డంగా కారు పెట్టేసారు. కారు పక్కకు తీయమంటే , మూరెడు పొడవు కత్తులు తీసి , బెదిరించారు. ఈ ఘర్షణలో నలుగురికి గాయాలయ్యాయి. కత్తులతో వీరంగం సృష్టించిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు..
ఇవీ చదవండి..