తండ్రి కోపం.. సెల్ ఫోన్ తీసిన ప్రాణం..

    0
    475

    కూతురు వేరే అబ్బాయిలో ఫోన్ లో మాట్లాడుతుందన్న అనుమానంతో తండ్రి మందలించాడు. క్షణికావేశంలో వెళ్లిన కూతురు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తెలంగాణలోని వనపర్తి జిల్లా చిన్న బావి మండలంలోని అయ్యవారిపల్లెలో జరిగింది. బొక్కలమ్మ, కురుమయ్య దంపతులకు కూతురు భువనేశ్వరి (16), కుమారులు అక్షయ కుమార్‌,హేమంత్‌ ఉన్నారు. కూతురు గత ఏడాది పదోతరగతి పాసై ఇంటి వద్దే ఉంటోంది. మంగళవారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ఫోన్‌లో మాట్లాడుతుండటం, ఎస్‌ఎంఎస్‌లు పంపడాన్ని పెద్ద తమ్ముడు చూశాడు.
    ఈ విషయం తండ్రికి చెప్పడంతో మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన భువనేశ్వరి అర్థరాత్రి పురుగుల మందు తాగింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం కొల్లాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయింది.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.