ప్రాచీన భారత దేశంలో శిల్పులు అద్భుతాలకు ఆద్యులు.. ప్రాచీన కాలంలో శిల్పశాస్త్రం నిర్మాణాలు, ఈనాటికీ అర్థంకాని రహస్యాలే..
ఆనాటి ఇంజనీరింగ్ విధానం నేటి ఇంజనీర్లకు వందేళ్లు తపస్సు చేసినా దక్కదు. కర్ణాటకలోని బెలవాడిలోని వీర నారాయణ స్వామిఆలయంలో ఏడాదికి రెండు సార్లు మార్చి 20వ తేదీ.. సెప్టెంబర్ 23వ తేదీ సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలోని విగ్రహంపై పడతాయి.
ప్రధాన ద్వారం నుంచి ఆ విగ్రహం.. రెండు వందల డెబ్భై అడుగుల దూరంలో ఉంటుంది. దాదాపుగా 900 ఏళ్ల కిందట కట్టిన ఈ దేవాలయంలో ప్రతీ ఏడాది.. ఆ తేదీలలో రెండు సార్లు.. ఉదయం 6 గంటల 20 నిమిషాల నుంచి 6.40 వరకూ సూర్యకిరణాలు విగ్రహంపై పడతాయి. ప్రాచీన కాలంలో శిల్పుల అద్భుత కళానైపుణ్యానికి మేధస్సుకు ఈ ఆలయం ఒక నిదర్శనం..