మనదేశంలో జీరో మైల్ స్టోన్ ఎక్కడుందో తెలుసా.. జీరో మైల్ స్టోన్ అంటే ఆ ప్రాంతంలో నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు దూరాన్ని లెక్కిస్తారు. భౌగోళికంగా జీరో మైల్ స్టోన్ దేశం మధ్యలో ఉంటుంది. అందుకే దానిని జీరో మైల్ స్టోన్ అంటారు. ఈ జీరో మైల్ స్టోన్ నాగపూర్ లో ఉంటుంది. జీరో మైల్ స్టోన్ వద్ద ఎనిమిది ముఖాలు కలిగిన స్థంభం ఉంటుంది. అంటే నాలుగు దిక్కులు.. నాలుగు ఉపదిక్కులను చూస్తూ ఈ జీరో మైల్ స్టోన్ ఉంటుంది. భౌగోళికంగా దేశంలో నాలుగు వైపులా ఉండే చెన్నై, ముంబై, కలకత్తా, ఢిల్లీ నగరాలకు నాగపూర్ మధ్యలో ఉంటుంది. అందుకే దీన్ని జీరో మైల్ స్టోన్ గా నిర్ణయించారు. బ్రిటీష్ కాలం నుంచి ఇది ఇప్పటికీ కొనసాగుతోంది.