భారత్ లో కేసులు, మరణాలు మళ్లీ పెరిగాయి..

    0
    29

    భారత్ లో సెకండ్ వేవ్ బలహీనపడుతున్న నేపథ్యంలో రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. అదే సమయంలో మరణాల సంఖ్య కూడా తగ్గుతోంది. అయితే గడచిన 24గంటల్లో నమోదైన కేసులు, మరణాల సంఖ్య మాత్రం అంత క్రితం నెంబర్ తో పోల్చి చూస్తే స్వల్పంగా పెరిగాయి.

    గడిచిన 24 గంటల్లో భారత్ లో కొత్తగా 1,32,788 కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే క్రితం రోజు(1,27,510)తో పోల్చితే కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. ఇక మరణాల సంఖ్య కూడా కాస్త పెరిగింది. క్రితం రోజు 2,795 మరణాలు చోటుచేసుకుంటే.. తాజాగా ఆ సంఖ్య 3,207కి చేరింది.
    తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 2,83,07,832 కాగా, ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 3,35,102.
    గత కొన్ని రోజులుగా కొత్తగా నమోదవుతున్న కేసుల కంటే రికవరీలే అధిక సంఖ్యలో ఉండటం ఊరట కలిగిస్తోంది. తాజాగా 2,31,456 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ కరోనాను జయించిన వారి సంఖ్య 2,61,79,085కి పెరిగింది. దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 92.48 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 17,93,645 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకూ 21,85,46,667 టీకాలు ఇచ్చారు.

    ఇవీ చదవండి..

    ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

    కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

    ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

    ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..