ఐ లవ్యూ అన్నయ్యా.. నన్ను పెళ్లి చేసుకో..

    0
    344

    వరుసకు సోదరుడయ్యే ఓ వ్యక్తిని ప్రేమించి, అతడితో వెళ్లిపోయిన ఓ కూతురి వల్ల పరువు మంటగలిసిందని బాధపడిన ఆ తల్లి పురుగుల మందు తాగి చనిపోయింది. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మాడ్గుల మండలంలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏప్రిల్‌ 18న ఓ బాలిక (16)ను అదే గ్రామానికి చెందిన వెంకటేష్‌ అనే వ్యక్తి ప్రేమించానంటూ తన వెంట తీసుకెళ్లిపోయాడు.

    ఆమె అతనికి వరుసకు సోదరి అవుతుంది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. పోలీసులు గాలించి వారిని వెనక్కు తీసుకొచ్చారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. వెంకటేష్‌ ను మే 25న కోర్టులో హాజరు పరిచి రిమాండుకు పంపారు.ఈ నేపథ్యంలో తల్లి, బాలిక మధ్య వాగ్వాదం జరుగుతోంది. సోదరుడు వరసయ్యే వ్యక్తితో ప్రేమ ఏంటని తల్లి వారించినా కూతురు వినలేదు. ఊరిలో పరువు పోయిందనే బాధతో తల్లి పొలంలో పురుగు మందుతాగి ఆత్మహత్య చేసుకుంది.

    ఇవీ చదవండి..

    ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

    కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

    ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

    ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..