ఢిల్లోలోని జితేంద్ర ను లాయర్ల డ్రెస్ లో చంపేసిన , దుండగులను కూడా పోలీసులు కోర్టులోనే కాల్చి చంపేశారు.. అయితే ఇప్పుడీ విషయం సంచలనమైంది. దేశ రాజధాని నగరంలో , కోర్టు హాల్లోకి నేరుగా ప్రవేశించి కాల్పులు జరిగిన ఘటన రాజధానిలో శాంతి భద్రతల వైఫల్యాన్ని తెలియజేస్తోంది .దుండగులిద్దరూ కొత్త డ్రెస్సులు వేసుకొచ్చారు. అడ్వొకేట్లు అన్నట్టు నీట్ గ హెయిర్ కట్ చేసుకున్నారు. తుపాకులు కోట్ లో పెట్టుకున్నారు. ఇద్దరూ 25 ఏళ్లలోపు వయసున్న వారే.. ముంబైలోని ప్రత్యర్థి టిల్లు గ్యాంగ్ సభ్యులని తెలుస్తోంది..
న్యాయమూర్తి కోర్టు హల్లో ఉన్న సమయంలో , జితేంద్ర అనే గ్యాంగ్ స్టర్ ను , హాల్లోకి తీసుకొచ్చారు. అందరు లాయర్ల మధ్యలో , లాయర్ల మాదిరే ఉన్న హంతకులు , వెంటనే తుపాకులు తీసి , జితేంద్రను కాల్చి పారేశారు. అప్రమత్తమైన పోలీసులు , వెంటనే కాల్పులు జరిపి , వాళ్ళిద్దరినీ కాల్చి వేశారు. లేకుంటే కోర్టు హాల్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో దుండగులు ఇంకెంత మారణహోమం సృష్టించేవారోనన్న భయం నెలకొనింది..
Firing inside #Rohini court, Police neutralized the gangster pic.twitter.com/JIUl7wgf6r
— Utkarsh Singh (@utkarshs88) September 24, 2021
ఇవీ చదవండి..