13500కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టి.. దేశం విడిచి పారిపోయిన నీరవ్ మోడీ.. మేహూల్ చోక్సి.. వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఇటీవల వరకూ ఆంటిగ్వా, బార్గుడా దేశాల్లో తలదాచుకున్న మేహూల్ చోక్సి.. తనకోసం వేట మొదలైందని తెలిసి.. పక్క దేశమైన డుమినికా దేశానికి పారిపోయాడు. డుమినికాలో చోక్సి ఉన్నాడని తెలిసి.. ఇంటర్ పోల్ అప్రమత్తమైంది. డొమినికా పోలీసులు చొక్సీని పట్టుకొని.. లాఠీలతో కుళ్లబొడిచారు.
మనదేశంలో మాదిరి వేలకోట్లు తిన్నా.. ఫైవ్ స్టార్ సౌకర్యాలతో జైల్లో పెట్టలేదు. తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించాడని.. భారత్ లో వేలకోట్లు ఎగ్గొట్టి తిరుగుతున్న వ్యక్తి ఇతడేనని.. ఆ పోలీసులు కొట్టిన దెబ్బలకు కళ్ళు వాచిపోయాయి. చేతిపై కూడా లాఠీ దెబ్బలు కనిపిస్తున్నాయి.
తనను భారతదేశానికి అప్పగిచ్చవద్దంటూ చోక్సి ఆ దేశ హైకోర్టులో కేసు వేశాడు. రెండవ తేదీ కేసు విచారణకు రానుంది. ఇదిలా ఉండగా చొక్సీని తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానం డొమినికాలో దిగింది.