ఏపీలో రేపటినుంచి సినిమా హాళ్లు తెరచుకోబోతున్నాయి. ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో ప్రకారం సీటు మార్చి సీటులో కూర్చునే విధంగా సినిమా హాళ్లలో ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈలోగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ జీవో అందరికీ షాకిస్తోంది. సినిమా టికెట్ల రేట్లను ఇష్టారీతిన పెంచుకునే విధంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు టికెట్ రేట్లను సవరించుకునే విధంగా ఈ జీవో తీసుకొచ్చారు.
ప్రతిపక్షాల ఆందోళన..
సినిమా టికెట్ల పెంపుపై ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకుందని ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తోంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు రేట్లు సవరించుకుంటే ఇక ప్రేక్షకులకు వినోదం దక్కదని అంటోంది.