తానేదో దీన స్థితిలో ఉన్నానంటూ మీడియా , సోషల్ మీడియాలో వార్తలపట్ల ప్రజా నటుడు ఆర్. నారాయణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేటింగ్ ల కోసం తన గురించి అవాస్తవాలు ప్రచారం చెయ్యొద్దని కోరారు. తానేదో ఇంటి అద్దెకూడా కట్టుకోలేకున్నానని , చాప దిండు మాత్రమే ఉందని , కూటికికూడా జరగనట్టు కధలు అల్లుతున్నారని అన్నారు. తాను తనకు ఇష్టమొచ్చినట్టు బ్రతుకుతున్నానని , తనకేమీ కష్టాలు లేవని అన్నారు. సోషల్ మీడియాలో వార్తలు చూసి , తన అభిమానులు , స్నేహితులు ఫోన్ చేసి సహాయంచేస్తామని చెబుతుంటే ఏడుపొస్తుందని అన్నారు. ఇలాంటి పనికిమాలిన వార్తలు ప్రచారం చెయ్యొద్దని కోరారు..
ఇవీ చదవండి..