సినీ నటి ఈశ్వరి దేశ్ పాండే , ఆమె ప్రియుడు శుభమ్ డెడ్జ్ ఒక కారు ప్రమాదంలో చనిపోయారు. మంగళవారం తెల్లవారుజామున వాళ్ళ కారు గోవానుంచి తిరిగివస్తుండగా వంతెనపైనుంచి కాలువలో పడిపోయింది.
కారు డోర్ సెంట్రల్ లాకింగ్ సిస్టం జాం కావడంతో ఇద్దరూ బయటకి రాలేక నీళ్లలోనే మునిగి మరణించారు. ఈశ్వరి దేశ్ పాండే హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె చేసిన సినిమాలు విడుదల కావలసిఉంది. వచ్చే నెలలో వీరి పెళ్ళికి నిశ్చితార్ధం జరగాల్సి ఉంది..
ఇవీ చదవండి..